29 August 2011

గిడుగుతాతకు జేజేలు - పిడుగుతాతకు జేజేలు


గిడుగు తాత
ఆగస్టు 29న 1863లో శ్రీకాకుళం జిల్లా వం
శీదార తీరాన  పర్వతాలపేటలో జన్మించారు. తెలుగుభాషకు ఆయన చేసినసేవలకు గుర్తుగా ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆయన దేశంలో తోలి భాషశాస్త్రవేత్తగా పేర్కొనవచ్చు .



 

మాటకు రాతకు తేడావోద్దని ,పండితభాషను ఆటక్కేంచిన, ప్రజల వాడుకభాషకు  వెలుగును పంచిన వ్యావహారిక భాషోద్యమ పితామహుడు  
         గిడుగుతాతకు జేజేలు ''  మన ''   పిడుగుతాతకు జేజేలు 
1910వ సంవత్సరం నుంచి ఆధునిక సాహిత్యంలో గిడుగు యుగమని నిడిదవోలు వెంకటరావు గారన్న మాటలు అత్యంత యదార్థం.
1914లో మద్రాసు విశ్వవిద్యాలయమలో వాడుకభాష విషయంలో ఇచ్చిననుమతి  ఉపసంహరించుకున్న పంతులువారు నిరు త్సాహపడలేదు.
తనప్రయత్నం తనమాట సత్యమని,న్యాయమని,ధర్మమని ఆత్మవిశ్వాసతో  బలంగానమ్మేవాడు.
1914వ సం,, కాకినాడలో జరిగిన ఆంధ్రసాహిత్యపరిషత్తులో గిడుగు మాట్లాడుతుంటే ఎద్దేవాచేసారు. 1915వ సం,,   రాజమండ్రిలో పంతులు మాట్లాడే భాషలో అల్లరి చేసారు .ఆనాటి పండిత ప్రముకులు.  ఆయన వాదం వినిపించడానికే ఆసరా లేకుండా చేసారు. 
అటువంటిది 
1933లో సప్తతి జన్మదినోత్సవం రాజమండ్రిలో 3రోజులపాటు  జీగీయమానంగా జరిగింది .ఆయన వాదాన్ని స్థాపించి వివరించే ఆయన రచనలు అందంగా అచ్చువేసి వెండి పెట్టెలో పెట్టి సభలో కానుకగాఇచ్చారు అదితన  వాదానికి విజయంగా ఆయన చాలా సంతోషించారు . 
1916వ సంవత్సరం కొవ్వూరులో జరిగిన ఆంధ్ర సాహిత్య ఆయన   వాదానికి  అనుకూల్యం సంపాదిన్చుకోగాలిగారు. 
1924లో తణుకులో జరిగిన పరిషత్తులో ఆయన 5గంటలపాటు  ఉపన్యసించి పండితులచేత ఒప్పించారు.ఒక తీర్మానం  కూడా చేఇంచారు.
 భావ ప్రకటనకు వాడుక భాష సరైన వాహిక నమ్మిన మహా మనిస్సాయన. రామూర్తి పంతులు  స్వయంకృషి చేత  మహాపండితుడైనాడాయన. పర్లాకిమిడి రాజకుమారుడికి విద్య బుద్దులు నేర్పారు . ఇంటిదగ్గర  ట్యూ షన్ చెప్పేవారు . రాజు కబురు పంపిన సున్నితంగా తిరష్కరించారట . రాజు దురాచార దుష్టమైన ఆనవాయతీలను నిలదీస్తూ ప్రజలను చైతన్యపరిచారు.
కాలం హ్రుద చేయడంఏమాత్రం ఇష్టం ఉండేదికాదు.రోజులో సగబాగం చదువ్తునో , రాస్తునో పరిశ్రామించేవారు.  పాఠశాల పట్యంశాలు పటాలు భోదించడంలో ఆమితశ్రద తీసుకునేవారని. గంటకోట్టడం కూడా వారికి తెలిసేది కాదని ,ఆ తరువాత క్లాసు చెప్పాల్సిన ఉపాద్యాయులు  చెప్పాడని బయపడి ఆవైపు వచేవారు కాదట . అందువల్ల ఒక్కొక్కసారి   2గంటలు 3గంటలు వారి క్లాసులు సాగేవి అని,  కాళ్ళకూరి సూర్యనారాయన రావు గారు, తాపీ ధర్మారావు గారు, టేకుమళ్ళ కామేశ్వరావు గారు మొదలైనవారు పంతులుదగ్గర  చదువ్కున్నోల్లు వారికి సన్నిహితంగా ఎరిగినవారు రాసారు .
 సుమారు 20 సంవత్సరాలు సవరుల సామాజిక వికాసం కోసం కృషిచేసిన పంతులు వారి విద్యాభివృదికోసం  కృషిచేసారు .పాఠశాల  నిర్వహించారు , ఉపాద్యయులను నియమించారు ,వాళ్ళ బడులకోసం వాచక పుస్తకాలను ప్రకటించారు .

ఆయన ఇంట్లో ప్రతి రోజు వారాల పిల్లలు బొంచేసేవారు . తేలికచర్ల వెంకటరత్నంగారు వారింట్లో  చదువ్కున్నారు.వెంకటరత్నం ఈడు వాడైనా గోపీనాథ్ బెహర అనే  క్షురక కుటుంభానికి చెందిన కుర్రోడు పంతులు గారి  ఒద్ధికలో చదువ్కున్నాడు. ఆవిద్యార్థికి స్కాలర్షిప్ ఇప్పించి పైతరగతులు చదివించారు .అతడు తహసీల్దరై, అటు తరువాత ఓడిశాలో కలేక్టార్ పనిచేసి దివాన్ కుడా అయ్నాడట.
1895వ సంవత్సరం దాక పంతులుగారికి తెలుగు భాష సాహిత్యాలతో పరిచయం లేదు . ఆ  సంవత్సరంలో వచ్చిన వీరేశలింగం పంతులుగారి  హరిచంద్ర నాటకంలోని పద్యాలూ ఆయనకు ఆర్థం కాక కళాశాల పండితులను ఇంకా తెలుగులో పరిజ్ఞానం ఉన్నవారిని ఆదిగేవాదట . 
1903వ   సంవత్సరం పార్లకిమిడిలో  రాయసంవెంకటశివుడుగారు  కొన్నాళ్ళు పని చేసారు .  వెంకటశివుడుగారు ఆ రోజుల్లో తెలుగు జమాన పత్రిక నడిపేవారు . ఆ   పత్రికకు పంతులుగారిని ఒక వ్యాసం వ్రాసి ఎవల్శింధిగా కోరగా పంతులుగారు '' బిడ్దల - శిక్షణ '' గూర్చి గ్రాంధికంలో వ్రాసి అందులో ఎమైన దోసాలు లోపాలు చుదమన్నాడట .  కానిఎప్పుడయితే వ్యావహారిక భాషోద్యమాన్ని భుజాన వేసుకోన్నారో తెలుగులో పాండిత్యం సంపాదించారు .
తెలుగు భాషా బోధనను వ్యావహారికంలో చేయాలన్న ఆయన ఆలోచనకు 
1907లో ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూళ్ల ఇన్‌స్పెక్టర్‌గా వచ్చిన జె.ఎ.యేట్స్ అనే ఆంగ్లేయుడి నుంచి మద్దతు లభించింది. అప్పటి ఏ వీఎన్ కాలేజీ ప్రధానాధ్యాపకుడు శ్రీనివాస అయ్యంగార్, గురజాడ అప్పారావు, యేట్స్, గిడుగు రామమూర్తి పంతులు కలిసి వ్యావహారిక భాషలో బోధనోద్యమానికి శ్రీకారం చుటా ్టరు. అప్పటికే రామమూర్తి వ్యావహారిక భాషలో బోధన కోసం ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం 'తెలుగు' అనే పత్రికను గిడుగు ప్రా రంభించారు.
ఈ సందర్భం లో వారికి నివాలర్పిస్తూ  తెలుగుభాష పరిపుష్టికి, పాలనలో తెలుగుకు తమవంతు భాద్యతను నిర్వర్తిస్తూ తెలుగు రక్షణ వేదిక ప్రజలభాషకు పునరంకితమౌతుంది .
                            గిడుగుతాతకు జేజేలు ''  మన ''  పిడుగుతాతకు జేజేలు  
                                      తెలుగు భాషకి జేజేలు - తెలుగు జాతికి జేజేలు.

e - తెలుగుబాట ఈనాడులో


27 August 2011

ఆధ్యక్షా ..!








ప్రజాస్వామ్యమంటే - ప్రజలకోసం ప్రజాపాలన , ప్రజల  బదులు  వాళ్ళ ప్రతినిధులు పలిస్తారు . 
మరిలాంటి ప్రభుత్వం తమప్రజలతో నిత్యం సజీవసంబంధం నేరపటానికి ప్రజలభాషనే తనవ్యవహారాలకి పూర్తిగావాడాలి. అందుకే అన్నారు - - - -
శిశువుకి తల్లిపాలు ఎంత శ్రేష్టమో , ప్రాణప్రదమూ, ప్రజస్వామ్యపుష్టికి ప్రజలభాష వినియోగం అంతే అవసరం మరి ,
మన రాష్ట్రములో 88% ప్రజలకు మాతృభాషా తెలుగు . తెలుగులో వ్యవహారాలన్నీ నడిస్తే అది ప్రజాప్రభుత్వం అవుతుంది . లేకపోతే ప్రజవేతిరేక ప్రభుత్వం అవుతుంది.
ఈనాటి ప్రభుత్వ కార్యాలయాలలో సగానికి సగం కూడా తెలుగులో జరగడం లేదు. 
ముఖ్యన్గా  రాజధానిలో ఉన్న సచివాలయం , శాఖదిపతుల కార్యాలయాలలో  తెలుగు వాడకం నామమాత్రమో, శున్యమో అందరి  అనుభవంలోని విషయం. 

1966లోనే అధికార భాష చట్టం వచ్చి తెలుగును రాష్ట్ర అధికారభాష ప్రకటించినా, ఆ చట్టాన్ని అనుసరించి ఐయదారు అధికారభాష సంగాలు పర్యవేక్షిస్తూ కొంత ప్రయత్నం చేసిన సాధించింది తక్కువ - సాధించల్శింది ఎక్కువ .సుమారు నాలుగున్నర దశాబ్దాలు కాలం కూడా ఈ ఆచరణకి నోచుకోకపోవటం - పాలకుల స్వభిమానరాహిత్యం, ప్రజల ఉదాసేనతకు కారణాలుగా పేర్కొనాలి 
అధికారభాష లక్ష్యం సాధించడానికి ప్రతివొక్కరు కృషిచేయాలని తెరవే గౌరవసూచన విజ్ఞప్తి .

15 August 2011

భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.....


జాతి స్వేచ్చ కోసం సుమారు ముడువందలల్యేల్ల బానిసత్వం నుంచి
స్వాతంత్ర్యపు నగవుల్ని మనకందించిన సమరయోధులందరికి వందనాలు 
పాదాభివందనాలు.... || 2 || 
తమ తమ ప్రాణాల్ని బలిచ్చి మనకందించిన స్వేచ్ఛాస్వాతంత్ర్యపు నగవుల్ని- కాపాడుకుందాం - 
తరతరాలకు అందిద్దాం || 2 || 
భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..... !