27 August 2011

ఆధ్యక్షా ..!








ప్రజాస్వామ్యమంటే - ప్రజలకోసం ప్రజాపాలన , ప్రజల  బదులు  వాళ్ళ ప్రతినిధులు పలిస్తారు . 
మరిలాంటి ప్రభుత్వం తమప్రజలతో నిత్యం సజీవసంబంధం నేరపటానికి ప్రజలభాషనే తనవ్యవహారాలకి పూర్తిగావాడాలి. అందుకే అన్నారు - - - -
శిశువుకి తల్లిపాలు ఎంత శ్రేష్టమో , ప్రాణప్రదమూ, ప్రజస్వామ్యపుష్టికి ప్రజలభాష వినియోగం అంతే అవసరం మరి ,
మన రాష్ట్రములో 88% ప్రజలకు మాతృభాషా తెలుగు . తెలుగులో వ్యవహారాలన్నీ నడిస్తే అది ప్రజాప్రభుత్వం అవుతుంది . లేకపోతే ప్రజవేతిరేక ప్రభుత్వం అవుతుంది.
ఈనాటి ప్రభుత్వ కార్యాలయాలలో సగానికి సగం కూడా తెలుగులో జరగడం లేదు. 
ముఖ్యన్గా  రాజధానిలో ఉన్న సచివాలయం , శాఖదిపతుల కార్యాలయాలలో  తెలుగు వాడకం నామమాత్రమో, శున్యమో అందరి  అనుభవంలోని విషయం. 

1966లోనే అధికార భాష చట్టం వచ్చి తెలుగును రాష్ట్ర అధికారభాష ప్రకటించినా, ఆ చట్టాన్ని అనుసరించి ఐయదారు అధికారభాష సంగాలు పర్యవేక్షిస్తూ కొంత ప్రయత్నం చేసిన సాధించింది తక్కువ - సాధించల్శింది ఎక్కువ .సుమారు నాలుగున్నర దశాబ్దాలు కాలం కూడా ఈ ఆచరణకి నోచుకోకపోవటం - పాలకుల స్వభిమానరాహిత్యం, ప్రజల ఉదాసేనతకు కారణాలుగా పేర్కొనాలి 
అధికారభాష లక్ష్యం సాధించడానికి ప్రతివొక్కరు కృషిచేయాలని తెరవే గౌరవసూచన విజ్ఞప్తి .

No comments:

Post a Comment