09 September 2011

జెరెమి జువిట్(Jeremy Jewett)విజిటింగ్ కార్డ్ తెలుగులో!

హైదారాబాద్ మహానగరంలో
అమెరికా కాన్సులేట్‌ .  
అక్కడ ఓ  అధికారి తెలుగులో  మాట్లాడుతున్నాడు . 
వింతగా చూస్తున్నారు , విశేషంగా మాట్లాడుకుంటున్నారు.
ఎవరుఆ అధికారి ఎందుకని వింతగా చూస్తూ మాట్లాడుతున్నారు. 

ఆయన అమెరికా వాసి. 
ఆయన  ఉద్యోగం  మహానగరంలో   ఉన్న అమెరికన్ కాన్సులేట్‌లో వైస్ కౌన్సెల్  మరియు వీసా అధికారి.
ఈ ఉద్యోగపర్వంలో ఆయన విధి తన మాతృదేశమైన అమెరికాకు ఇక్కడి నుండి వెళ్ళే యోగ్యమైన వాళ్ళను ఎన్నుకుని వాళ్ళకు వీసాలు ఇవ్వడమో ఇవ్వకపోవడమో! అందులోనూ తమ దేశభాష అయిన ఆంగ్లము గురించి ఆలోచించడమో లేదా పరీక్షించడమో తప్ప వేరే ఇతర భాష గురించో సంస్కృతి గురించో అస్సలు ఆలోచించనక్కర్లేదు కూడా!!! కానీ… 
ఆయన అక్కడితో ఆగిపోలేదు. ఆయన ఎంత అమెరికా వాసి అయినా వృత్తి రీత్యా తనకు తెలుగు అవసరం కాకపోయినా ఆయన మమేకమవ్వవలసింది తెలుగు వాళ్ళతో కాబట్టి ఇక్కడి భాషను మాట్లాడగలిగితేనే ఇక్కడి వాళ్ళకు మరింత చేరువ కాగలమన్న తలపుతో ఆయన మన తెలుగు భాషని  నేర్చుకోవాలనుకున్నారు! ఆరు నెలలు అక్కడే తెలుగును అభ్యసించారు… చివరికి మన తెలుగువాడిలా మాట్లాడటం మొదలుపెట్టారు!
 
ఈయన తెలుగు ఉచ్చరణ కూడా మనవాళ్ళలానే ఉంటుందిట! తెలుగు చదవడం కూడా వచ్చట! జెరెమి జువిట్ విజిటింగ్ కార్డ్ కూడా తెలుగులోనే ఉంటుందిట!..

08 September 2011

సి.పి. బ్రౌన్ భారతీయుడా లేక తెలుగువాడా ..?

విశాల విశ్వంలో కొన్ని దేశాలలో  పుట్టినవారిని , మరికొన్ని దేశాలలో  స్థిరనివాసం  ఏర్పరుచుకొని  ఉన్నవారిని ఆదేశసస్థులుగా పరిగనిస్తుంటారు.
 
జాతిమాట సరేగాని పుట్టిన స్థలాన్నిబట్టి  అంటే   బ్రౌన్  భారతీయుడు. ఆయన కలకత్తా హుగ్లీ  నదీతీరంలో  1798నవంబర్  07తేదిన జన్మించాడు. 14ఏళ్ళు వచ్చేదాకా ఈ దేశం గాలిపీల్చాడు నీళ్ళు తాగాడు , ఇక్కడి  మట్టి తత్వాన్ని బాగా వోంటబట్టంచుకున్నాడు. 

14వఏట తల్లీ సోదరులతో పాటు ఇంగ్లాండు వెళ్ళాడు. అక్కడున్నది ఐదేల్లె 1817లో కుంఫినీ ఉద్యోగిగా తన  19వ యేట మళ్లీ మద్రాసులో అడుగుపెట్టాడు. మద్యలో మూడేళ్ళు లండన్ కి సెలవ్ మీద వెళ్ళటం తప్పిస్తే  మొత్తం  48సంవత్సరాలు భారతదేశం లోనే గడిపాడు . 

బ్రౌన్ బాల్యం , ఉజ్వల యవ్వనం , వృద్యాప్య ఆరంభం అన్ని ఇక్కడేగడిచాయి. న 57యేట పక్షపాత రోగంతో  భారతదేసాన్ని  శాశ్వతంగా  వదిలి వెళ్ళాడు .   బ్రౌన్  లండోన్ లో మరో  29ఏళ్ళు  బతికాడు. కాని అది శేషజీవితం, శేషజీవితమే ఆయినా ఇక్కడి సారస్వత వ్యాసంగం కొనసాగింపు తుదిశ్వాస దాక కోనసాగుతూనే ఉంది  .

1824 ప్రారంభం మాచలీపట్నంలో (అప్పుడాయనకు  26ఏళ్ళు)   ఉన్నాడు.  అప్పటికే బ్రౌన్ గారికి తెలుగు వాడుక భాషలో మాట్లాడగలుగుచున్నాడు. " హిందువుల ఆచారాలు - పండుగలు " అనే పుస్తకం మరియు పుస్తకంలో   వేమన ప్రసస్తి   బ్రౌన్ ను బాగా ఆకర్షించింది . వేమన గురించి వినడం. వెంటనే వేమన పద్యాల తాటాకు పుస్తకాల సేకరణకు ఉద్యమించిడం 16ప్రతులను సేకరించటం - అంగ్లానువదించడం. అన్ని మార్చిలో మొదలెట్టి నవంబర్ వరకు అంటే  9నెలలు ముగించడం. 

 ఆ రోజుల్లో చేదోడు వాదోడుగా తిప్పాబోట్ల వెంకటశివశాస్త్రి , అద్వైత  బ్రహ్మయ్యగార్లు ఉండేవారు . బ్రౌన్ అబిప్రాయాలలో  పండితుల ప్రభావం కొంతా కనిపిస్తుంది. తెలుగు రావాలంటే ముందు భారతం చదవమనేవాడట క్లాసిక్ చదివితే భాష వస్తుందనేవాడట. ఆయనకు మొదటనుంచి వాడుక  భాష పట్లే ముగ్గు చూపేవాడు ఆయన ప్రాణమంత వాడుకభాష పైనే ఉండేది . ఈ అభిమానం వల్లనే బ్రౌన్ డిక్షినరీ లో ఆర్థాలు ఎక్కువగా వ్యావహారిక భాష లోనే ఉంటాయి.

బ్రౌన్ స్థానికులతో ఎప్పుడూ కలిసేవాడు. స్థానికులను అర్థం చేసుకోవాలన్న తపనే కాని 
తనవర్ణ అహంకారాన్ని ఎక్కడా  పదర్శించిన దాఖలాలు   కనిపించవు.1833లొ  నందన  కరువు కాలంలో చీఫ్ సెక్రటరీకి పంపిన  నివేదికలో  scrcityఅనేమాట వాడకుండా  famineఅని యదార్థ పరిస్థితిని రాసినందుకి  చీవాట్లు తిన్నాడు. వంచన శిల్పంతో కూడిన పాలనభాషలో రాయకపోవడం  బ్రౌన్ నిజయితీకి నిదర్శనం.  To benefit the hindhus was my primary objective  అని రాసుకున్నాడు.  

బ్రౌన్  1873లో  తన సాహిత్య జీవితాన్ని సింహవలోకనం చేస్తూ మొదటి ముద్రణ ఒక బాల్య ప్రయత్నంగా (జువేనిలే ఎఫ్ఫోర్ట్ / juvenile effort ) వర్ణించుకున్నాడు. మలి ముద్రణలు  మరియు 20ఎళ్ళ సాహిత్య, అభిరుచి, ఆశయ , లక్ష్యాల  పలితాలను గురించి  తృప్తిని అసంతృప్తిని వినయంగా చెప్పుకున్నాడు.

బ్రౌన్ చేసిపోయిన  ఉపకృతికి తెలుగునాడులో  ఒక ఊరు ఊరుకే  ఆయన పేరు పెట్టుకోవచ్చు. ఆయితే ఒక ఉన్నతమైన లైబ్రరీని కుడా ఆయన పేరుమీద నెలకొల్పలేకపోయము. ఈ సమయంలో  తమిళ సారస్వత కి  ఎ కొద్దిగా  ప్రయత్నం  చేసియున్న  ఈప్రపంచానికి   తెలిపె  ప్రయత్నంలో  బ్రౌన్  పాటికి  ఎ  ఆకాశానికి  ఎత్తియుండేవాళ్ళు.

బ్రౌన్ ఎప్పటికితీరని   సాహిత్య పిపాస , చిత్తసుద్ధి , నిస్వార్తపర్వతం  నేర్చుకోవలిసిన లక్షణాలు .

ఈ లెక్కల ప్రకారం బ్రౌన్ ను  మరోసారి  " భారతీయుడు " అనాలనిపిస్తుంది . భారతియుడే కాదు ' తెలుగు వాడు ' అని కుడా అనాలనిపిస్తుంది. తన జీవితంలో అత్త్యధిక సమయాన్ని , సంపాదనని , మేథనూ, పరిశ్రమను సర్వం, తెలుగు  సారస్వత   పునరుద్దరనకే   వేచించిన  త్యాగశీలిని  తెలుగువాడు  అంటే అది మన గౌరవంకోసమేగాని  ఆయనకు ఒరిగేదేమిలేదు .

07 September 2011

ఎవరనుకొన్నారీ తెలుగు వాడు ?

సృష్టికి ప్రతి సృష్టి చేసి,  వసిష్టుని కెదురు ప్రశ్నేవేసిన 
రాజుగా , రాజర్షిగా,   బ్రహ్మర్షిగా పై కెదిగిన
అల విశ్వామిత్రునకు ఆదర్శ కుమారుడు 
భరుతునికి సహజన్ముడు,
భారత సామ్రాజ్యరాజ  పదవికి వారసుడు.

ఒక  బ్రహ్మయై  - కాల జ్ఞానం  
ఒక బ్రహ్మనయై  - సమాజవాదం  
ఒక వేమనయై  - వేదసారం
ఉర్వికి బోధించినోడు  
సిద్దేంద్రుడై " కూచిపూడి " శివనాట్యం చేసినవాడు.

కాకతీయ సామ్రాజ్యం   " ఘనం "  ముగా  పాలించినవాడు ..
విజయనగరంనందు    " భువనవిజయం" సాధించినాడు


తెలుగుపాట అరువనోట పలికించిన వాడు
త్యాగయ్య.
భారత రాజ్యాంగ గీత ప్రవచించెన వాడు
అల్లాడి కృష్ణయ్య.
త్రివర్ణ పతాక రేఖలు తీర్చెన వాడు
పింగళి వెంకయ్య.


భాష స్వాతంత్రోద్యమంలో సమరాలు చెసినవాడు
గిడుగు రామమూర్తి  పంతులు.

గుండెను మరాతుపాకీకి కి గురి చూపెన వాడు

టంగుటూరి వీరేశలింగం పంతులు.

 
విల్లమ్ములతో పిరంగి గుళ్ళనడ్డే న వాడు
అల్లూరి సీతారామరాజులు.


దేశమంటే  " మనుషు "లని
జాతీయ దృక్పదాన్ని నేర్పినవాడు
గురజాడ అప్పారావు .
తెలుగు సాహిత్యయంలో మరో ప్రపంచం రచించాడు
"నేను సైతం ప్రపంచాగ్నికి   సమిధ నోక్కటి.." అన్నాడు
శ్రీ శ్రీ /  శ్రీరంగం శ్రీనివాసరావు

ఆరంభ శూరుడనే

అపవాదుకు గురైనోడు
అనుకున్నది కాకుంటే
అందరిపై అలుగువాడు.

ఇల్లుదాటి ఎల్లదాటి

ఎల్లజగతి తిరిగినొడు
ఏదేశమేగినా....
సొంతూరు మరువని వాడు
పాతతగువలు వదలని వాడు.

ఎవరనుకొన్నారీ   తెలుగువాడు.
పరపాలన వదిలిన 
పరభాషను వదలనివాడు
మా పెద్దోళ్ళు మా చిన్నోళ్ళు
మా వారసులు తెలుగు వాళ్ళు ....

06 September 2011

తెలుగు భాష ప్రమాదంలో ఉందా..? తెలుగు జాతి ప్రమాదంలో ఉందా..?

తెలుగు భాష ప్రమాదంలో ఉందా ?   తెలుగు జాతి ప్రమాదంలో ఉందా  ?
తెలుగులేని జాతిని ఎమనీ పిలవాలి ?

ఆంగ్లేయులపాలనలో నాణేలమీద   కనిపించిన తెలుగు ..  
తెలిగీయులపలనలో పెదాలమీద కనిపించకపోతుంటే...... 
చుస్తుంటారా....చూస్తూనే ఉంటారా.... రండి..  కలసిరండి...  కదిలిరండి ....
 
తెలుగు భాష రక్షణకై సైనికులలా - తెలుగుజాతి పక్షానికై సేవకులలా !
తెలుగువీర మిత్రుల్లారా .  
పొట్లూరి హరికృష్ణ : 0 99 080 57 895


తెలుగు రక్షణ వేదిక :   జెండా :


తెలుగు రక్షణ వేదిక :  ఆశయ - లక్ష్యాలు :


05 September 2011

గురుదేవులకు పాదాభివందనాలు...!

సంస్కృతంలో  ' విద్ ' ఆనే ధాతువు  '' విద్య ''  ఆనే  పదానికి మూలం . తెలియుటని ఈ పదానికి మౌలికార్థం కాబట్టి ,  తెలియదగిన  ఏ అంశమైన ''విద్ద్యే ''  ఆతుంది . 

విద్య : శీలనిర్మాణం, నిర్మాణానికి కావలసిన పద్దతులన్నీ వివరించడం. వ్యక్తిత్వనిర్మాణం,   ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ నిగ్రహాన్ని కలిగించడం . ధర్మ పరిజ్ఞానాన్ని  మత పరిజ్ఞానాన్ని కలిగించడం. సాహిత్య , సంస్కృతిని రక్షించి  వ్యాప్తి చెందించడం . సాంకేతిక , సాంఘీక విధులను నిర్వహింపచేయడం.సామాజికాభివృద్ధిని  కలిగించడం. విద్య బోధనా లక్ష్యాలుగా , దేశకాల పరిస్థితుల ననుసరించి విద్య, బోదనలోను స్వరూపం మార్పు చెందుతుంటుంది .  

విద్య స్థాయీని పెంపొందించడానికి తల్లిభాషల అవసరముందని  తద్వారా దేశాభివృద్ధిని సాదించొచ్చని   కొఠారి కమీషన్ భావించింది . ప్రాంతీయ భాషల ఆభివృద్ధి యొక్క  అవసరాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం వారు C.I.I.L(central institute of indian languages)ని నెలకొల్పారు.

ఉపాద్యాయులు పిల్లలోని సృజనాత్మకత శక్తిని వెలికితీసి వారి  ఊహలకు జీవం పోసే, వీరి బతుకుకు బంగారుబాట వేస్తారు . విద్యావేత్తలు , శాస్త్రవేత్తలు, డాక్టర్లు , ఇంజనీర్లు , లాయర్లు , ఇలా ఎందరో జాతి నిర్మాతలను ఈ సమాజానికి  అందిస్తారు ....

29 August 2011

గిడుగుతాతకు జేజేలు - పిడుగుతాతకు జేజేలు


గిడుగు తాత
ఆగస్టు 29న 1863లో శ్రీకాకుళం జిల్లా వం
శీదార తీరాన  పర్వతాలపేటలో జన్మించారు. తెలుగుభాషకు ఆయన చేసినసేవలకు గుర్తుగా ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆయన దేశంలో తోలి భాషశాస్త్రవేత్తగా పేర్కొనవచ్చు .



 

మాటకు రాతకు తేడావోద్దని ,పండితభాషను ఆటక్కేంచిన, ప్రజల వాడుకభాషకు  వెలుగును పంచిన వ్యావహారిక భాషోద్యమ పితామహుడు  
         గిడుగుతాతకు జేజేలు ''  మన ''   పిడుగుతాతకు జేజేలు 
1910వ సంవత్సరం నుంచి ఆధునిక సాహిత్యంలో గిడుగు యుగమని నిడిదవోలు వెంకటరావు గారన్న మాటలు అత్యంత యదార్థం.
1914లో మద్రాసు విశ్వవిద్యాలయమలో వాడుకభాష విషయంలో ఇచ్చిననుమతి  ఉపసంహరించుకున్న పంతులువారు నిరు త్సాహపడలేదు.
తనప్రయత్నం తనమాట సత్యమని,న్యాయమని,ధర్మమని ఆత్మవిశ్వాసతో  బలంగానమ్మేవాడు.
1914వ సం,, కాకినాడలో జరిగిన ఆంధ్రసాహిత్యపరిషత్తులో గిడుగు మాట్లాడుతుంటే ఎద్దేవాచేసారు. 1915వ సం,,   రాజమండ్రిలో పంతులు మాట్లాడే భాషలో అల్లరి చేసారు .ఆనాటి పండిత ప్రముకులు.  ఆయన వాదం వినిపించడానికే ఆసరా లేకుండా చేసారు. 
అటువంటిది 
1933లో సప్తతి జన్మదినోత్సవం రాజమండ్రిలో 3రోజులపాటు  జీగీయమానంగా జరిగింది .ఆయన వాదాన్ని స్థాపించి వివరించే ఆయన రచనలు అందంగా అచ్చువేసి వెండి పెట్టెలో పెట్టి సభలో కానుకగాఇచ్చారు అదితన  వాదానికి విజయంగా ఆయన చాలా సంతోషించారు . 
1916వ సంవత్సరం కొవ్వూరులో జరిగిన ఆంధ్ర సాహిత్య ఆయన   వాదానికి  అనుకూల్యం సంపాదిన్చుకోగాలిగారు. 
1924లో తణుకులో జరిగిన పరిషత్తులో ఆయన 5గంటలపాటు  ఉపన్యసించి పండితులచేత ఒప్పించారు.ఒక తీర్మానం  కూడా చేఇంచారు.
 భావ ప్రకటనకు వాడుక భాష సరైన వాహిక నమ్మిన మహా మనిస్సాయన. రామూర్తి పంతులు  స్వయంకృషి చేత  మహాపండితుడైనాడాయన. పర్లాకిమిడి రాజకుమారుడికి విద్య బుద్దులు నేర్పారు . ఇంటిదగ్గర  ట్యూ షన్ చెప్పేవారు . రాజు కబురు పంపిన సున్నితంగా తిరష్కరించారట . రాజు దురాచార దుష్టమైన ఆనవాయతీలను నిలదీస్తూ ప్రజలను చైతన్యపరిచారు.
కాలం హ్రుద చేయడంఏమాత్రం ఇష్టం ఉండేదికాదు.రోజులో సగబాగం చదువ్తునో , రాస్తునో పరిశ్రామించేవారు.  పాఠశాల పట్యంశాలు పటాలు భోదించడంలో ఆమితశ్రద తీసుకునేవారని. గంటకోట్టడం కూడా వారికి తెలిసేది కాదని ,ఆ తరువాత క్లాసు చెప్పాల్సిన ఉపాద్యాయులు  చెప్పాడని బయపడి ఆవైపు వచేవారు కాదట . అందువల్ల ఒక్కొక్కసారి   2గంటలు 3గంటలు వారి క్లాసులు సాగేవి అని,  కాళ్ళకూరి సూర్యనారాయన రావు గారు, తాపీ ధర్మారావు గారు, టేకుమళ్ళ కామేశ్వరావు గారు మొదలైనవారు పంతులుదగ్గర  చదువ్కున్నోల్లు వారికి సన్నిహితంగా ఎరిగినవారు రాసారు .
 సుమారు 20 సంవత్సరాలు సవరుల సామాజిక వికాసం కోసం కృషిచేసిన పంతులు వారి విద్యాభివృదికోసం  కృషిచేసారు .పాఠశాల  నిర్వహించారు , ఉపాద్యయులను నియమించారు ,వాళ్ళ బడులకోసం వాచక పుస్తకాలను ప్రకటించారు .

ఆయన ఇంట్లో ప్రతి రోజు వారాల పిల్లలు బొంచేసేవారు . తేలికచర్ల వెంకటరత్నంగారు వారింట్లో  చదువ్కున్నారు.వెంకటరత్నం ఈడు వాడైనా గోపీనాథ్ బెహర అనే  క్షురక కుటుంభానికి చెందిన కుర్రోడు పంతులు గారి  ఒద్ధికలో చదువ్కున్నాడు. ఆవిద్యార్థికి స్కాలర్షిప్ ఇప్పించి పైతరగతులు చదివించారు .అతడు తహసీల్దరై, అటు తరువాత ఓడిశాలో కలేక్టార్ పనిచేసి దివాన్ కుడా అయ్నాడట.
1895వ సంవత్సరం దాక పంతులుగారికి తెలుగు భాష సాహిత్యాలతో పరిచయం లేదు . ఆ  సంవత్సరంలో వచ్చిన వీరేశలింగం పంతులుగారి  హరిచంద్ర నాటకంలోని పద్యాలూ ఆయనకు ఆర్థం కాక కళాశాల పండితులను ఇంకా తెలుగులో పరిజ్ఞానం ఉన్నవారిని ఆదిగేవాదట . 
1903వ   సంవత్సరం పార్లకిమిడిలో  రాయసంవెంకటశివుడుగారు  కొన్నాళ్ళు పని చేసారు .  వెంకటశివుడుగారు ఆ రోజుల్లో తెలుగు జమాన పత్రిక నడిపేవారు . ఆ   పత్రికకు పంతులుగారిని ఒక వ్యాసం వ్రాసి ఎవల్శింధిగా కోరగా పంతులుగారు '' బిడ్దల - శిక్షణ '' గూర్చి గ్రాంధికంలో వ్రాసి అందులో ఎమైన దోసాలు లోపాలు చుదమన్నాడట .  కానిఎప్పుడయితే వ్యావహారిక భాషోద్యమాన్ని భుజాన వేసుకోన్నారో తెలుగులో పాండిత్యం సంపాదించారు .
తెలుగు భాషా బోధనను వ్యావహారికంలో చేయాలన్న ఆయన ఆలోచనకు 
1907లో ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూళ్ల ఇన్‌స్పెక్టర్‌గా వచ్చిన జె.ఎ.యేట్స్ అనే ఆంగ్లేయుడి నుంచి మద్దతు లభించింది. అప్పటి ఏ వీఎన్ కాలేజీ ప్రధానాధ్యాపకుడు శ్రీనివాస అయ్యంగార్, గురజాడ అప్పారావు, యేట్స్, గిడుగు రామమూర్తి పంతులు కలిసి వ్యావహారిక భాషలో బోధనోద్యమానికి శ్రీకారం చుటా ్టరు. అప్పటికే రామమూర్తి వ్యావహారిక భాషలో బోధన కోసం ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం 'తెలుగు' అనే పత్రికను గిడుగు ప్రా రంభించారు.
ఈ సందర్భం లో వారికి నివాలర్పిస్తూ  తెలుగుభాష పరిపుష్టికి, పాలనలో తెలుగుకు తమవంతు భాద్యతను నిర్వర్తిస్తూ తెలుగు రక్షణ వేదిక ప్రజలభాషకు పునరంకితమౌతుంది .
                            గిడుగుతాతకు జేజేలు ''  మన ''  పిడుగుతాతకు జేజేలు  
                                      తెలుగు భాషకి జేజేలు - తెలుగు జాతికి జేజేలు.

e - తెలుగుబాట ఈనాడులో


27 August 2011

ఆధ్యక్షా ..!








ప్రజాస్వామ్యమంటే - ప్రజలకోసం ప్రజాపాలన , ప్రజల  బదులు  వాళ్ళ ప్రతినిధులు పలిస్తారు . 
మరిలాంటి ప్రభుత్వం తమప్రజలతో నిత్యం సజీవసంబంధం నేరపటానికి ప్రజలభాషనే తనవ్యవహారాలకి పూర్తిగావాడాలి. అందుకే అన్నారు - - - -
శిశువుకి తల్లిపాలు ఎంత శ్రేష్టమో , ప్రాణప్రదమూ, ప్రజస్వామ్యపుష్టికి ప్రజలభాష వినియోగం అంతే అవసరం మరి ,
మన రాష్ట్రములో 88% ప్రజలకు మాతృభాషా తెలుగు . తెలుగులో వ్యవహారాలన్నీ నడిస్తే అది ప్రజాప్రభుత్వం అవుతుంది . లేకపోతే ప్రజవేతిరేక ప్రభుత్వం అవుతుంది.
ఈనాటి ప్రభుత్వ కార్యాలయాలలో సగానికి సగం కూడా తెలుగులో జరగడం లేదు. 
ముఖ్యన్గా  రాజధానిలో ఉన్న సచివాలయం , శాఖదిపతుల కార్యాలయాలలో  తెలుగు వాడకం నామమాత్రమో, శున్యమో అందరి  అనుభవంలోని విషయం. 

1966లోనే అధికార భాష చట్టం వచ్చి తెలుగును రాష్ట్ర అధికారభాష ప్రకటించినా, ఆ చట్టాన్ని అనుసరించి ఐయదారు అధికారభాష సంగాలు పర్యవేక్షిస్తూ కొంత ప్రయత్నం చేసిన సాధించింది తక్కువ - సాధించల్శింది ఎక్కువ .సుమారు నాలుగున్నర దశాబ్దాలు కాలం కూడా ఈ ఆచరణకి నోచుకోకపోవటం - పాలకుల స్వభిమానరాహిత్యం, ప్రజల ఉదాసేనతకు కారణాలుగా పేర్కొనాలి 
అధికారభాష లక్ష్యం సాధించడానికి ప్రతివొక్కరు కృషిచేయాలని తెరవే గౌరవసూచన విజ్ఞప్తి .