విశాల విశ్వంలో కొన్ని దేశాలలో పుట్టినవారిని , మరికొన్ని దేశాలలో స్థిరనివాసం ఏర్పరుచుకొని ఉన్నవారిని ఆదేశసస్థులుగా పరిగనిస్తుంటారు.
జాతిమాట సరేగాని పుట్టిన స్థలాన్నిబట్టి అంటే బ్రౌన్ భారతీయుడు. ఆయన కలకత్తా హుగ్లీ నదీతీరంలో 1798నవంబర్ 07తేదిన జన్మించాడు. 14ఏళ్ళు వచ్చేదాకా ఈ దేశం గాలిపీల్చాడు నీళ్ళు తాగాడు , ఇక్కడి మట్టి తత్వాన్ని బాగా వోంటబట్టంచుకున్నాడు.
14వఏట తల్లీ సోదరులతో పాటు ఇంగ్లాండు వెళ్ళాడు. అక్కడున్నది ఐదేల్లె 1817లో కుంఫినీ ఉద్యోగిగా తన 19వ యేట మళ్లీ మద్రాసులో అడుగుపెట్టాడు. మద్యలో మూడేళ్ళు లండన్ కి సెలవ్ మీద వెళ్ళటం తప్పిస్తే మొత్తం 48సంవత్సరాలు భారతదేశం లోనే గడిపాడు .
బ్రౌన్ బాల్యం , ఉజ్వల యవ్వనం , వృద్యాప్య ఆరంభం అన్ని ఇక్కడేగడిచాయి. న 57యేట పక్షపాత రోగంతో భారతదేసాన్ని శాశ్వతంగా వదిలి వెళ్ళాడు . బ్రౌన్ లండోన్ లో మరో 29ఏళ్ళు బతికాడు. కాని అది శేషజీవితం, శేషజీవితమే ఆయినా ఇక్కడి సారస్వత వ్యాసంగం కొనసాగింపు తుదిశ్వాస దాక కోనసాగుతూనే ఉంది .
1824 ప్రారంభం మాచలీపట్నంలో (అప్పుడాయనకు 26ఏళ్ళు) ఉన్నాడు. అప్పటికే బ్రౌన్ గారికి తెలుగు వాడుక భాషలో మాట్లాడగలుగుచున్నాడు. " హిందువుల ఆచారాలు - పండుగలు " అనే పుస్తకం మరియు పుస్తకంలో వేమన ప్రసస్తి బ్రౌన్ ను బాగా ఆకర్షించింది . వేమన గురించి వినడం. వెంటనే వేమన పద్యాల తాటాకు పుస్తకాల సేకరణకు ఉద్యమించిడం 16ప్రతులను సేకరించటం - అంగ్లానువదించడం. అన్ని మార్చిలో మొదలెట్టి నవంబర్ వరకు అంటే 9నెలలు ముగించడం.
ఆ రోజుల్లో చేదోడు వాదోడుగా తిప్పాబోట్ల వెంకటశివశాస్త్రి , అద్వైత బ్రహ్మయ్యగార్లు ఉండేవారు . బ్రౌన్ అబిప్రాయాలలో పండితుల ప్రభావం కొంతా కనిపిస్తుంది. తెలుగు రావాలంటే ముందు భారతం చదవమనేవాడట క్లాసిక్ చదివితే భాష వస్తుందనేవాడట. ఆయనకు మొదటనుంచి వాడుక భాష పట్లే ముగ్గు చూపేవాడు ఆయన ప్రాణమంత వాడుకభాష పైనే ఉండేది . ఈ అభిమానం వల్లనే బ్రౌన్ డిక్షినరీ లో ఆర్థాలు ఎక్కువగా వ్యావహారిక భాష లోనే ఉంటాయి.
బ్రౌన్ స్థానికులతో ఎప్పుడూ కలిసేవాడు. స్థానికులను అర్థం చేసుకోవాలన్న తపనే కాని
తనవర్ణ అహంకారాన్ని ఎక్కడా పదర్శించిన దాఖలాలు కనిపించవు.1833లొ నందన కరువు కాలంలో చీఫ్ సెక్రటరీకి పంపిన నివేదికలో scrcityఅనేమాట వాడకుండా famineఅని యదార్థ పరిస్థితిని రాసినందుకి చీవాట్లు తిన్నాడు. వంచన శిల్పంతో కూడిన పాలనభాషలో రాయకపోవడం బ్రౌన్ నిజయితీకి నిదర్శనం. To benefit the hindhus was my primary objective అని రాసుకున్నాడు.
బ్రౌన్ 1873లో తన సాహిత్య జీవితాన్ని సింహవలోకనం చేస్తూ మొదటి ముద్రణ ఒక బాల్య ప్రయత్నంగా (జువేనిలే ఎఫ్ఫోర్ట్ / juvenile effort ) వర్ణించుకున్నాడు. మలి ముద్రణలు మరియు 20ఎళ్ళ సాహిత్య, అభిరుచి, ఆశయ , లక్ష్యాల పలితాలను గురించి తృప్తిని అసంతృప్తిని వినయంగా చెప్పుకున్నాడు.
బ్రౌన్ చేసిపోయిన ఉపకృతికి తెలుగునాడులో ఒక ఊరు ఊరుకే ఆయన పేరు పెట్టుకోవచ్చు. ఆయితే ఒక ఉన్నతమైన లైబ్రరీని కుడా ఆయన పేరుమీద నెలకొల్పలేకపోయము. ఈ సమయంలో తమిళ సారస్వత కి ఎ కొద్దిగా ప్రయత్నం చేసియున్న ఈప్రపంచానికి తెలిపె ప్రయత్నంలో బ్రౌన్ పాటికి ఎ ఆకాశానికి ఎత్తియుండేవాళ్ళు.
బ్రౌన్ ఎప్పటికితీరని సాహిత్య పిపాస , చిత్తసుద్ధి , నిస్వార్తపర్వతం నేర్చుకోవలిసిన లక్షణాలు .
ఈ లెక్కల ప్రకారం బ్రౌన్ ను మరోసారి " భారతీయుడు " అనాలనిపిస్తుంది . భారతియుడే కాదు ' తెలుగు వాడు ' అని కుడా అనాలనిపిస్తుంది. తన జీవితంలో అత్త్యధిక సమయాన్ని , సంపాదనని , మేథనూ, పరిశ్రమను సర్వం, తెలుగు సారస్వత పునరుద్దరనకే వేచించిన త్యాగశీలిని తెలుగువాడు అంటే అది మన గౌరవంకోసమేగాని ఆయనకు ఒరిగేదేమిలేదు .
తెలుగు రక్షణ వేదిక పేరు మీద మీరు అందించిన వ్యాసం బాగుంది. కాని మీ తెలుగులోనే చాలా తప్పులు వున్నాయి. ఏవో కొన్నయితే చెప్పగలం కాని, తప్పులు ఎక్కువగా వున్నాయి. వాతిని సరి చేసుకుంటే బాగుంటుందని నా చిన్న సలహా.. మీ జగదీష్.
ReplyDelete