05 September 2011

గురుదేవులకు పాదాభివందనాలు...!

సంస్కృతంలో  ' విద్ ' ఆనే ధాతువు  '' విద్య ''  ఆనే  పదానికి మూలం . తెలియుటని ఈ పదానికి మౌలికార్థం కాబట్టి ,  తెలియదగిన  ఏ అంశమైన ''విద్ద్యే ''  ఆతుంది . 

విద్య : శీలనిర్మాణం, నిర్మాణానికి కావలసిన పద్దతులన్నీ వివరించడం. వ్యక్తిత్వనిర్మాణం,   ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ నిగ్రహాన్ని కలిగించడం . ధర్మ పరిజ్ఞానాన్ని  మత పరిజ్ఞానాన్ని కలిగించడం. సాహిత్య , సంస్కృతిని రక్షించి  వ్యాప్తి చెందించడం . సాంకేతిక , సాంఘీక విధులను నిర్వహింపచేయడం.సామాజికాభివృద్ధిని  కలిగించడం. విద్య బోధనా లక్ష్యాలుగా , దేశకాల పరిస్థితుల ననుసరించి విద్య, బోదనలోను స్వరూపం మార్పు చెందుతుంటుంది .  

విద్య స్థాయీని పెంపొందించడానికి తల్లిభాషల అవసరముందని  తద్వారా దేశాభివృద్ధిని సాదించొచ్చని   కొఠారి కమీషన్ భావించింది . ప్రాంతీయ భాషల ఆభివృద్ధి యొక్క  అవసరాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం వారు C.I.I.L(central institute of indian languages)ని నెలకొల్పారు.

ఉపాద్యాయులు పిల్లలోని సృజనాత్మకత శక్తిని వెలికితీసి వారి  ఊహలకు జీవం పోసే, వీరి బతుకుకు బంగారుబాట వేస్తారు . విద్యావేత్తలు , శాస్త్రవేత్తలు, డాక్టర్లు , ఇంజనీర్లు , లాయర్లు , ఇలా ఎందరో జాతి నిర్మాతలను ఈ సమాజానికి  అందిస్తారు ....

No comments:

Post a Comment