09 September 2011

శ్రీ కాళోజీ 98వ జయంతి మరియు మాండలిక భాషా దినోత్సవం!

ప్రజాకవి, 
స్వాతంత్ర్య సమరయోధుడు,  
పద్మవిభూషణ్,
శ్రీ కాళోజీ  నారాయణరావు గారి  98వ జయంతి 
మరియు  
మాండలిక భాషా దినోత్సవం 

మానవుడికి పుట్టుకతోనే వచ్చే  మాండలిక భాషని  కాపాడుకోవలనేవారు, భాష రెండుతీర్లు- ఒకటి బడిపలుకుల భాష, రెండు పలుకుబడుల భాష, నీభాషలోనే  బతుకున్నది - నీయాసలోనే సంస్క్రుతున్నది అనేవారు.

మన భాష, యాసలన్న అభిమానముండాలే  అనేవారు.ఆయన కవిత్వం-వ్యక్తిత్వం, రచనలు-చరణలు ప్రజల ఆకాంక్షలు-ప్రజా ఉద్యమాలకోసం కాళోజీ జీవించారు. 

 ప్రాంతాలకే   పరిమితమైన  ఈ మాండలిక  భాషా   నేటి ఈ అంతర్జాలం ద్వారా  ప్రపంచానికి చేరువ  చేసిన ఈ సాంకేతిక విప్లవానికి  మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ......
తెలుగుజాతికి  మాండలిక భాషా దినోత్సవ శుభాకాంక్షలు .

No comments:

Post a Comment