17 September 2011

సర్దార్ పటేల్ V/s నిజాం = హైదరాబాదు రాజ్య విమోచనం..!

భారత దేశానికి   1947ఆగస్టు  15న స్వాతంత్ర్యం  వచ్చినది.   స్వాతంత్ర్యం తర్వాత  స్వల్ప వ్యవధిలోనే  ఎలాంటి  హింస  రక్తపాతం లేకుండా  534 రాచరిక  సంస్థానాలు  దేశంలో ఐఖ్యమై భారత ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడినది.  కానీ నిజాం పాలనలోని  హైదరాబాదు  రాజ్య  ప్రాంతం (  హై.బా రాజ్య విస్తీర్ణం-- 82.7 వేల చదరపు మైళ్ళు) భారత  ప్రభుత్వం లో కలవలేదు.  

కలవక పోగా మరో వైపు   7వ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ ఆదేశాలతో  ఖాసిం రజ్వీ  సైన్యాలు  తెలంగాణా ప్రాంతంలో రాయడానికి వీలుకాని  అంత అరాచకం సృష్టించారు.  ఆ సందర్భంలో కమ్యునిస్టు పార్టీ నాయకత్వంలో దళాలు , సంఘాలు మరియు సమరయోధులు నిజాం రజాకార్ల  సైన్యాన్ని ఎదురిస్తూ ప్రజల పక్షాన పోరాడుతున్నారు.

ఈ  క్రమంలో  భారత  ప్రభుత్వం   సర్దార్ వల్లభాయ్
పటేల్ ఆదేశాలతో  సైన్యం " ఆపరేషన్ పోలో " పేరుతో  1948 సెప్టెంబరు   13న   నిజాం హైదరాబాదు  రాజ్యంలో  కదం తొక్కాయి. రాజ్యన్ని నలువైపుల  నుంచి సైన్యం చుట్టూ ముట్టారు.  సైన్యాలతో పోరాడలేక  1948 సెప్టెంబరు 17న  నిజాం ప్రభువు  మీర్ ఉస్మాన్ ఆలీఖాన్  భారత ప్రభుత్వానికి లొంగిపోయారు.   బొల్లారంలోని  ప్రస్తుత  రాష్ట్రపతిభవన్ లో  నిజాం  సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎదుట  లొంగిపోయాడు.




చిత్రం లో

సర్దార్ పటేల్
జీకి

నమస్కరిస్తున్న

నిజాం నవాబు

మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ .





భారత  గవర్నర్ జనరల్  హిస్  ఎక్స్ లెన్సీ   రాజ గోపాలాచారి ఆదేశాల మేరకు నా ప్రభుత్వం  రాజీనామా చేసింది అని  రేడియోలో ప్రకటించాడు. ఈ విలీన కార్యక్రమం  సర్దార్ వల్లభాయ్ పటేల్  సమక్షంలో జరిగింది.   ఈ విలీనం తో  సంపూర్ణ భారతదేశం ఏర్పడినది. 
కర్ణాటకలోని కొన్ని జిల్లాల లో   ( హైదరాబాద్  కర్ణాటక ప్రాంతం )   సెప్టెంబరు 17ను  విమోచన దినాచరణ 1948 నుంచి  జరుగుచున్నది. 

1 comment:

  1. నిన్న టీ.వీ.లో విమోచనా లేక విద్రోహమా అన్న చర్చ విన్నాక;-విద్రోహమెలా ఔతుంది?భారత్ భూమి మధ్యలో ఫ్యూడల్బానిస వ్యవస్థతో పాలించే నవాబు పాకిస్తాంతో కుమ్మక్కు ఔతున్నసమయంలో సైన్యాన్ని పంపించి భారత ప్రభుత్వం ప్రజలకు విముక్తి కలిగించింది.(17-09-1948).అందుచేత ఆరోజుని విమోచన దినంగా నే జరుపుకోవాలి.ఇది చర్చనీయ అంశమేకాదు.ఇందులో ఒక మతానికిగాని ,వర్గానికిగాని వ్యతిరేకం ఏమీలేదు. తర్వాత జరిగిన కమ్మ్యూనిస్టు ,నక్సలైటు ,ప్రత్యేక తెలంగాణా ఉద్యమాలు వేరే సమస్యలు.వాటిమీద విభిన్న అభిప్రాయాలు ఉంటే ఉండ వచ్చును. మన భూభాగాలైన కాశ్మీరు,గొవాలనుకూడా మన సైన్యాలని పంపించి విలీనం చేసుకున్నామని గుర్తించాలి.

    ReplyDelete