12 September 2011

తెలుగు ''సుప్రీం'' న్యాయమూర్తిగా జస్టిస్ జాస్తి చలమేశ్వర్..!

సుప్రీం కోర్టులో  ఐదుగురు  న్యాయమూర్తుల నియామక పక్రియ జరిగింది, 
ఆ ఐదుగురులో  మన తెలుగువాడు జస్టిస్   '' జాస్తి చలమేశ్వర్ '' కూడా ఉన్నారు.

ఆయన 1953జూన్ 23న కృష్ణ జిల్లా లోని మొవ్వ మండలం పెదముత్తేవి లో లక్ష్మి నారాయణ, అన్నపూర్ణాదేవి దంపతులకు  జన్మించారు. బార్య లక్ష్మినళిని , ముగ్గురు కుమారులు వెంకట రామ్ భూపాల్, నాగ భూషణ్, లక్ష్మి నారాయణ ఉన్నారు.

 జాస్తి లక్ష్మినారాయణ మచిలీపట్నంలో న్యాయవాదిగా  పనిచేస్తున్న కాలంలో హిందు హైస్కూల్  జస్టిస్  ''జాస్తి చలమేశ్వర్'' పీ.యూ.సీ వరకు చదివారు. మద్రాసు లయోలా కాలేజీలో బీఎస్పీ (పిజిక్స్) చదివారు. 1976లొ విశాకలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఎల్.ల్.బీ పూర్తిచేశారు. అదే ఏడాది బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు.

జస్టిస్ గారికి  రాజ్యాంగ, ఎన్నికల, సెంట్రోల్  ఎక్సైజ్ , కస్టమ్స్ , ఐటీ, క్రిమినల్ చట్టాల్లో మంచి ప్రావీణ్యమ్ ఉంది. 1985-1986లో రాష్ట్ర లోకాయుక్త స్టాండింగ్ కౌన్సిల్ గా వ్యవహరించారు.  1988-1989లో  ప్రభుత్వ న్యాయవాది (హూంశాఖ వ్యవహారాలు) గా నియమితులయ్యారు. 1995లో సీనియర్ న్యాయవాదులయ్యారు.  1997జూన్ 23న పుట్టిన రోజునే రాష్ట్ర  హైకోర్ట్ అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు  స్వీకరించారు.  1999మే 17న పూర్తి  స్థాయి  న్యాయమూర్తిగా బాధ్యతలు  చేపట్టారు. 2007మే  3   న గౌహతి హైకోర్ట్ చీఫ్  జస్టిస్  గా పదోన్నతిపై  వెళ్లారు.  2010మార్చి  17నుంచి  కేరళ  హైకోర్ట్  ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు  చేపట్టారు. . పాడిపంటలన్న  ప్రతేక అభిమానం. జస్టిస్   గారు ఏటా రెండు మూడు సార్లు పెదముత్తేవి వచ్చి తన పొలాలను స్వయంగా పర్యవేక్షించేవారు.   
 
తెలుగువారు సుప్రీం కోర్టులో న్యాయముర్తులుగా పనిచేసినవారు జస్టిస్ పి.సత్యనారాయణ, జస్టిస్ పి.జగన్ మోహన్ రెడ్డి , జస్టిస్  ఓ.చిన్నపరెడ్డి , జస్టిస్  కే.రామస్వామి, జస్టిస్ కే. జయచంద్రా రెడ్డి, జస్టిస్ బి.పి.జీవనరెడ్డి, జస్టిస్  ఎం.జగన్నాథరావు,  జస్టిస్ పి.వెంకట రామారెడ్డి,  జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి సేవలు అందించడం. మనం గర్వించదగ్గ విషయమే. 

No comments:

Post a Comment